
విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలోని 43, 44వ డివిజన్లలో శనివారం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి పెన్షన్ సొమ్మును అందించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ.4,000 పెన్షన్ కూటమి ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు.